Header Banner

మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో మరి ఎక్కువగా!

  Fri Jun 06, 2025 12:29        Health

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి, ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరణాలు కూడా నమోదవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: అదే అతడి కొంప ముంచింది.. కోరికలు ఏవైనా అవి హద్దుల్లో ఉండాలి లేకపోతే!


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... నిన్న‌టి వ‌ర‌కు 4,302గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య, ఈరోజు 4,866కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో 564 కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే సమయంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు కోవిడ్ కారణంగా మరణించారు. మృతుల్లో ఢిల్లీకి చెందిన ఐదు నెలల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విచారకరం. ఆ చిన్నారికి ముందే శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఆరుగురు మృతులు వృద్ధులు కాగా, వీరు మధుమేహం, అధిక రక్తపోటు, న్యూమోనియా వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో చెరో ఇద్దరు చ‌నిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

    

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (562), పశ్చిమ బెంగాల్ (538), మహారాష్ట్ర (526), గుజరాత్ (508) రాష్ట్రాలు నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 105 కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 44 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని, వీరిలో ఎక్కువ మంది ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #covid #india #corona rises #activecases #7dead #kerala